
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ భయపెడుతుంది. గత మూడు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ లో భారీగా కేసులు నమోదవుతుండడం కలవర పెడుతుంది. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా మరో 51 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు మహమ్మారి కారణంగా మరో ఇద్దరు మృతిచెందారు. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1326కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 472ఆక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనే నమోదు అవుతుండడం కలవరపెడుతోంది. మంగళవారం నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 37 ఉండగా, 14 వలస వచ్చిన వారు ఉన్నారు. మంగళవారం మరో 21మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 822 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా మరో 32 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందారు.