
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1082 కి చేరుకుంది. ఆదివారం మరో 21 పాసిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 508 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం మరో 46 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 545 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తక్కువ కేసులు నమోదు అవుతుండడంతో పాటు జీరో ఆక్టివ్ కేసుల జిల్లాలు సైతం పెరుగుతున్నాయి. కాగా ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనే నమోదు అవుతుండడం కలవరపెడుతోంది. ఆదివారం నమోదైన కేసుల్లో 20 గ్రేటర్ లొనే ఉన్నాయి. మరో కేసు జగిత్యాల లో నమోదైంది.
mest realistiske sexdukke