
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో 49 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు మొత్తం 15 జీవోలు జారీ చేసింది.
26 మంది ఐఏఎస్ లకు…
ముగ్గురికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా, కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ముగ్గురికి సైతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. వీరితో పాటు ఒకరికి ముఖ్య కార్యదర్శిగా, 4 గురికి కార్యదర్శిగా, 6 గురికి అదనపు కార్యదర్శులుగా పదోన్నతులు లభించాయి. 5 గురు ఐఏఎస్ లకు సంయుక్త కార్యదర్శులుగా, మరో 4 గురికి డెప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
23 మంది ఐపీఎస్ లకు…
5 గురు ఐపీఎస్ లకు అదనపు డీజీలుగా, 4 గురు ఐపీఎస్ లకు ఐజిలుగా, 7 గురు ఐపీఎస్ లకు డీఐజీలుగా, 6 గురు ఐపీఎస్ లకు సీనియర్ స్కేల్ అధికారులుగా పదోన్నతులు కల్పించారు.
కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరొక అధికారికి ఐజిగా పదోన్నతి లభించింది.
